పచ్చదనం కోసం సీడ్ బాల్స్ స్ర్పే
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:26 PM
నల్లమల అడవిలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు అటవీ శాఖ అధికారులు అధునాతన సాం కేతికతను వినియోగిస్తూ డ్రోన్ల ద్వారా స్పీడ్బాల్స్ పిచికారి చేయించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
డ్రోన్ల్ సహాయంతో అటవీ ప్రాంతాల్లో పిచికారి
శ్రీశైలం, జులై 21 (ఆంధ్రజ్యోతి): నల్లమల అడవిలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు అటవీ శాఖ అధికారులు అధునాతన సాం కేతికతను వినియోగిస్తూ డ్రోన్ల ద్వారా స్పీడ్బాల్స్ పిచికారి చేయించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం రేంజ్ పరిధిలో సుమారు 13 హెక్టార్లలో గల మైదానాలు మెట్టభూములు కలిగిన 13ప్రాంతాల్లో 1,30,000 స్పీడ్ బాల్స్ పిచికారి చేసినట్లు చెప్పారు. రెండు రోజులుగా ఎఫ్ఆర్వో పరమేశులు, ఎఫ్ఎస్వో మదన్కుమార్ ఆధ్వర్యంలో డ్రోన్ టెక్నీషియన్లు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.