వేగంగా..
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:08 AM
కోవెలకుంట్ల పరిఽఽధిలో 167కె జాతీయ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి.
67కె జాతీయ రహదారి పనులు
కోవెలకుంట్ల, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కోవెలకుంట్ల పరిఽఽధిలో 167కె జాతీయ రహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, బీసీ జనార్ధన్ రెడ్డి ఆర్అండ్బీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో స్వయంగా పరిశీలిస్తూ నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి, నంద్యాల మీదుగా తిరుపతికి నేరుగా వెళ్లవచ్చు. సుమారు 70 కిమీ దూరం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే గ్రామాల వద్ద సర్వీసు రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. -