Share News

సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:17 PM

అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదేశించారు.

సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి
సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఆదేశించారు. శుక్ర వారం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గానికి చెందిన ప్రజల నుంచి స్వయంగా ఆయన దరఖాస్తులను స్వీకరించారు. సంబంధిత అధికా రులతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్క రించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్‌కు వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించాలని అన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 11:19 PM