Share News

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:49 PM

తమ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నదని, అందువల్లే ప్రజాదర్బార్‌కు విశేష స్పందన వస్తున్నదని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి
వినతులు స్వీకరిస్తున్న మంత్రి

న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల రూరల్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నదని, అందువల్లే ప్రజాదర్బార్‌కు విశేష స్పందన వస్తున్నదని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Updated Date - Aug 07 , 2026 | 11:49 PM