Share News

పకడ్బందీగా చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:18 AM

ప్రతి ఇంటి నుంచి పకడ్బందీగా చెత్తను సేకరించి, పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ సిరి ఆదేశించారు. శనివారం కల్లూరు మండలం పర్ల గ్రామంలో జీరో-గ్యాప్‌ శానిటేషన్‌ ఆంధ్రా ర్యాలీని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామ సచివాలయం, పీహెచ్‌సీ ప్రాంగణంలో మోక్కలు నాటారు

పకడ్బందీగా చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ
స్వచ్ఛరథాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

పర్ల గ్రామంలో స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటి నుంచి పకడ్బందీగా చెత్తను సేకరించి, పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ సిరి ఆదేశించారు. శనివారం కల్లూరు మండలం పర్ల గ్రామంలో జీరో-గ్యాప్‌ శానిటేషన్‌ ఆంధ్రా ర్యాలీని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామ సచివాలయం, పీహెచ్‌సీ ప్రాంగణంలో మోక్కలు నాటారు. ప్రతి గ్రామంలో ఇంటింటి చెత్త సకరణ తప్పనిసరిగా చేయానిని, తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జీరో-గ్యాప్‌ శానిటైషన్‌ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజల భాగ్యస్వామ్యం కీలకమన్నారు. రాష్ట్రం ప్రభుత్వం స్వఛ్ఛరథాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ తెలిపారు. మొదటి దశలో 8 మండలాలకు స్వఛ్చరథాలు వచ్చాయని, రెండో దశలో 8, మూడవ దశలో 9 స్వఛ్చరథాలు వస్తాయని క తెలిపారు. ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి భాద్యత అన్నారు. రాబోయో తరాలకు స్వఛ్చమైన వాతావరణం అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఆర్డీవో సందీ్‌పకుమార్‌, డీపీవో భాస్కర్‌, కల్లూరు తహసీల్దార్‌ కె.ఆంజనేయులు, ఎంపీడీవో నాగశేషాచలరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:18 AM