రాఘవేంద్రుడి క్షేత్రం.. భక్తుల కోలాహలం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:14 PM
రాఘవేంద్రుడి క్షేత్రం.. భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం ధనుర్మాసం అష్టమి సెలవుదినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రాలయం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రుడి క్షేత్రం.. భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం ధనుర్మాసం అష్టమి సెలవుదినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, తుంగభద్ర కారిడార్, సంస్కృత పాఠశాల కారిడార్, ప్రధాన రహాదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదీతీరం భక్తుల సందడి నెలకొంది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.