Share News

మొల్ల నేటి తరానికి స్ఫూర్తి

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:27 PM

కవయిత్రిగా స్వతంత్ర రచనలకు మార్గం వేసిన మొదటి మహిళ మొల్ల అని నంద్యాల జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కొనియాడారు.

మొల్ల నేటి తరానికి స్ఫూర్తి
నివాళి అర్పిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జయంతి

నివాళులర్పించిన పోలీసులు

నంద్యాల క్రైం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కవయిత్రిగా స్వతంత్ర రచనలకు మార్గం వేసిన మొదటి మహిళ మొల్ల అని నంద్యాల జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కొనియాడారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రముఖ కవయిత్రి ‘మొల్ల’ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లిర్పించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి రాజపోషణ లేకుండానే కేవలం భక్తితో ఆమె చేసిన సాహిత్య కృషి నేటి తరానికి, మహిళా సాధికారతకు గొప్ప స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్‌, బాబు, ఆర్‌ఎస్‌ఐలు ఉమామహేశ్వరరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, శ్రీనివాసులు, జిల్లా పోలీసు పరిపాలనా విభాగం అధికారులు క్రిష్ణారెడ్డి, ఖాదర్‌వలి పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 11:27 PM