Share News

ప్రజలకు చేరువగా న్యాయసేవలు

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:32 PM

సమాజంలో ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి తెలియజేశారు.

ప్రజలకు చేరువగా న్యాయసేవలు
న్యాయసేవల వాహనాన్ని ప్రారంభిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి

కర్నూలు లీగల్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు అందించడానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి తెలియజేశారు. కర్నూలులోని న్యాయ సేవాసదన్‌ భవన్‌లో న్యాయ సేవల వాహనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన, న్యాయ సహాయం, హక్కులపై చైతన్య పరచడానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాగూర్‌ ప్రతి జిల్లాకు ఒక వాహనాన్ని కేటాయించారని తెలిపారు. ఈ వాహనాలు హక్కులపై అవగాహన కల్పించి చైతన్యం తీసుకువచ్చేందుకు ఉపయోగ పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్‌అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరామచంద్రరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:32 PM