శివస్వాములపై లాఠీచార్జి అమానుషం
ABN , Publish Date - Feb 13 , 2026 | 01:04 AM
శ్రీశైలంలో ఆల య గర్భగుడి సమీపంలో ఈనెల 9న శివస్వాములపై పోలీసులు లాఠీచార్చి చేయడం అమానుష చర్యఅని, ఈ అంశంపై విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి డిమాండ్ చేశారు.
వీహెచపీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో ఆల య గర్భగుడి సమీపంలో ఈనెల 9న శివస్వాములపై పోలీసులు లాఠీచార్చి చేయడం అమానుష చర్యఅని, ఈ అంశంపై విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని కేసీ కెనాల్ వినాయక ఘాట్లోగల గణేశ మందిరం సమావేశ హాలులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవ డం, ముందుస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలె త్తిందని అన్నారు. ఈ సమావేశంలో వీహెచపీ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, జిల్లా కార్యదర్శి ఈపూరి నాగరాజు, జిల్లా కోశాధి కారి తుంగా రమేష్ పాల్గొన్నారు.