పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:07 AM
ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్ రావు సూచించారు.
జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్ రావు
డోన రూరల్, జనవరి 6(ఆంధ్రజోతి): ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్ రావు సూచించారు. మంగళవారం మండలంలోని కనపకుంట గ్రామంలో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం చిన్నమల్కా పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాధుల నియంత్రణ చర్యల గురించి అడిగి తెలు సుకున్నారు. ఆయన వెంట జిల్లా మలేరియా సహాయాధికారి సత్యనారాయణ, చిన్నమల్కాపురం పీహెచసీ డాక్టర్ చెన్నకేశవులు ఉన్నారు.