హోరాహోరీగా బాలికల అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:40 AM
పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ మైదానంలో మంగళవారం జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు 4వ రోజు రసవత్తరంగా సాగాయి
నంద్యాల హాస్పిటల్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్ధ మైదానంలో మంగళవారం జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు 4వ రోజు రసవత్తరంగా సాగాయి. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం బాలురకు బాస్కెట్ బాల్, కబడ్డీ, బాక్సింగ్, ఖోఖో, ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 300ల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎంఎన్వి రాజు మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో గెలుపొందిన క్రీడాకారులకు నంద్యాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. చివరి రోజు 13న బ్యాడ్మింటన్, హకీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.