జూడాల సమ్మె ఉధృతం
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:48 PM
స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. సోమవారం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాల సంఘం అధ్యక్షుడు డా.నిశాంత్ తెలిపారు.
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. సోమవారం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాల సంఘం అధ్యక్షుడు డా.నిశాంత్ తెలిపారు. హౌస్ సర్జన్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీల పీజీలు, సీనియర్ రెసిడెంట్లు ఈ సమ్మెలో భాగమయ్యారని తెలిపారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా దశలవారిగా ఆందోళనలు చేస్తున్నామని, మొదట ఓపీ సేవలను బహిష్కరించి ప్రభుత్వానికి సమయం ఇచ్చామన్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 5గంటలోగా ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక స్పందన అందకపోవడంతో ఫేజ్-3 ఆందోళనలో భాగంగా అత్యవసర సేవలను నిలిపివేసి సమ్మెను ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు.