Share News

ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:45 PM

జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు బుధవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. నంద్యాలలో విజయనరసింహ, రైతుబజార్‌ లోపల వున్న వెంకటసుబ్బారెడ్డి మిల్స్‌ సెంటర్‌, మిల్క్‌డైరీలోని ఔట్‌లెట్‌లోని పాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పుడ్‌సేప్టీ అధికారులు వెంకటరాముడు, కాశీంవలి పాల్గొన్నారు.

ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు
విజయపాలకేంద్రం వద్ద వున్న ఔట్‌లెట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పుడ్‌సేప్టీ అధికారులు

నంద్యాల కల్చరల్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు బుధవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. నంద్యాలలో విజయనరసింహ, రైతుబజార్‌ లోపల వున్న వెంకటసుబ్బారెడ్డి మిల్స్‌ సెంటర్‌, మిల్క్‌డైరీలోని ఔట్‌లెట్‌లోని పాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పుడ్‌సేప్టీ అధికారులు వెంకటరాముడు, కాశీంవలి పాల్గొన్నారు. వెంకటరాముడు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పాలను తనిఖీ చేశామన్నారు. ముందస్తుగా పాలలో కలర్స్‌, షుగర్‌, యూరియా, ఆయిల్స్‌ వంటి వాటిని స్టాచ్‌తో పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో పాలలో ఎటువంటి కల్తీలు లేవన్నారు. ఇంకా లోతుగా పరీక్షల కోసం కొన్ని శాంపిల్స్‌ తీసుకొని హైదరాబాద్‌లోని నాచారం ల్యాబ్‌కు పంపించామన్నారు. మధ్యాహ్నం నుంచి బనగానపల్లెలో తనిఖీలు కొనసాగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు నిరంతరాయంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - Feb 25 , 2026 | 11:45 PM