సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:51 PM
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణం లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే నేరుగా అర్జీలు స్వీకరిం చారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి 75 అర్జీలను వచ్చాయని, వీటిలో ప్రధానంగా నూతన గృహాలు, ఇళ్ల పట్టాలు, పింఛన్లపై అర్జీలు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు.