'అ'పూర్వ కలయిక
ABN , Publish Date - May 24 , 2026 | 12:26 AM
మండలంలోని ఆకుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిశారు.
సంజామల, మే 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆకుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిశారు. శనివారం తమ మిత్రులు, ఉపాధ్యాయులు సమావేశమై గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఉపాధ్యాయులు దేవదానం, కుమార్ బాబు, యాదవ్, శ్రీనవాస్ యాదవ్, ప్రసాదరావు, వెంకటస్వామి, దామోదర్ను సన్మానించారు. పూర్వ విద్యార్ధులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, లోకేశ్వర శర్మ, మురళి, విశ్వనాథ్, మహబూబ్బాషా, హాజీబాషా, ఖాజా, మాదవి, వీరకుమార్, హుస్సేన్బీ, రాధిక, ప్రశాంతి, జ్యోతి పాల్గొన్నారు.