Share News

ర్యాగింగ్‌పై కొనసాగుతున్న విచారణ

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:16 AM

ర్నూలు మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌పై విచారణ కొనసాగుతున్నట్లు ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ తెలిపారు.

ర్యాగింగ్‌పై కొనసాగుతున్న విచారణ
విచారణ చేస్తున్న ప్రిన్సిసాల్‌, సీఐలు, యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సభ్యులు

ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థుల నుంచి ఫిర్యాదు లేదు

కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ చిట్టినరసమ్మ

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌పై విచారణ కొనసాగుతున్నట్లు ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ తెలిపారు. సోమవారం ప్రిన్సిపాల్‌ చాంబర్‌లో త్రీటౌన్‌, టూటౌన్‌ సీఐలు పి.శేషయ్య, శ్రీధర్‌, యాంటీ ర్యాగింగ్‌ కమిటీ చైర్మన్‌ డా. రామకృష్ణ నాయక్‌, కమిటీ సభ్యులు, ప్రిన్సిపాల్‌ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 17, 18 తేదీల్లో ర్యాగింగ్‌పై విద్యార్థులు ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేసిన విషయంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. అయితే మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఎవరూ తమను ర్యాగింగ్‌ చేసినట్లు తెలపలేదని, పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. హాస్టల్‌లో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు, సీనియర్‌ విద్యార్థులు వేర్వేరు భవనాల్లో ఉంటారని, రాత్రి 9 గంటల తర్వాత ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థుల భవనంలోకి ఎవరికీ ప్రవేశం ఉండదన్నారు. ఇది సీనియర్‌ విద్యార్థుల అంతర్గత వ్యవహారం అని, పోలీసుల విచారణలో కూడా ఇదే తేలిందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 12:16 AM