అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:25 PM
అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దని టైగర్ ఫారెస్టు డిప్యూటీ డైరెక్టరు చైతన్యకుమార్రెడ్డి అన్నారు. శనివారం రుద్రవరం ఫారెస్టు రేంజ్ను సందర్శించారు. బోరింగ్ బేస్ క్యాంపునను పరిశీలించి అటవీ సంరక్షణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రుద్రవరం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దని టైగర్ ఫారెస్టు డిప్యూటీ డైరెక్టరు చైతన్యకుమార్రెడ్డి అన్నారు. శనివారం రుద్రవరం ఫారెస్టు రేంజ్ను సందర్శించారు. బోరింగ్ బేస్ క్యాంపునను పరిశీలించి అటవీ సంరక్షణపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రుద్రవరంలోని ఫారెస్టు కార్యాల య ఆవరణంలో ఉన్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. వర్షాలు ఉరిస్తే ప్లాంటేషన్లను నాటేందుకు సిద్ధం చేయాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో రేంజర్ ముర్తుజావలి, డిప్యూటీ రేంజర్ శ్రీనివాసరెడ్డి, సెక్షన్ ఆఫీసర్లు మహబూబ్ఖాన్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.