Share News

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:42 PM

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని రాష్ట్ర న్యాయ, మైనార్జీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
అర్జీలను స్వీకరిస్తున్న మంత్రి ఫరూక్‌

మంత్రి ఫరూక్‌

నంద్యాల రూరల్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని రాష్ట్ర న్యాయ, మైనార్జీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజక వర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jan 16 , 2026 | 11:42 PM