స్వల్పకాలిక పంటలు సాగుచేయండి
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:19 AM
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షం తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు స్వల్ప కాలిక పంటలైన మినుము, పెసర, సజ్జ సాగు చేయాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ వెంకటరమణ పేర్కొన్నారు.
ప్రిన్సిపల్ సైంటిస్ట్ వెంకటరమణ
రుద్రవరం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షం తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు స్వల్ప కాలిక పంటలైన మినుము, పెసర, సజ్జ సాగు చేయాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ వెంకటరమణ పేర్కొన్నారు. బుఽధవారం శ్రీరంగాపురం గ్రామంలో ఖేత్ బచావో అభియన్ నిర్వహించారు. ఈ పంటలు సాగుచేస్తే వర్షం తక్కువగా కురిసినా దిగుబడి వేకతందపాకపనేజ జిల్లావనరుల కేంద్రం సహాయవ్యవసాయ సంచాలకుడు చెన్యయ్య మాట్లాడుతూరసాయనిక ఎరువుల వినియోగం తగ్గించాలని, అంతర పంటలు సాగుచేయాలని, పంట మార్పిడి పాటించాలన్నారు. ఏవో సుమతి మాట్లాడుతూ మండలానికి 700 క్వింటాళ్లు జీలుగ విత్తనాలు వచ్చాయన్నారు. కౌలు రైతులు తప్పనిసరిగా సీసీఆర్సీ కార్డులను పొందాలని వివరించారు. కార్యదర్శి పాములేటి, వీఆర్వో అంకాల్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు తేజ, శివక్రిష్ణ, దినే్షకుమార్ ఉన్నారు.