Share News

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:30 AM

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నగర పాలక అడిష నల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అడిషనల్‌ కమిషనర్‌

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నగర పాలక అడిష నల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవా రం స్థానిక ఎస్బీఐ ఎం ప్లాయీస్‌ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన 8 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎంఈ.మనోహర్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి ఎం.రఘు, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్‌ బాషా, ఆర్‌ఓ స్వర్ణలత, టిడ్కో అధికారి పెంచలయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ సొహైల్‌, మెప్మా సీఆర్‌ఓ భారతి, సర్వేయర్‌ మద్దిలేటి పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:30 AM