జడ్పీలో కారుణ్య నియామకాలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:56 PM
జిల్లా పరిషత్ పరి ధిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు పోస్టులకు కారుణ్య నియామకాల కింద భర్తీచేశారు.
కర్నూలు న్యూసిటీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ పరి ధిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టు పోస్టులకు కారుణ్య నియామకాల కింద భర్తీచేశారు. గురువారం జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆదేశాల మేరకు సీఈవో జి.నాసరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఐదు గురికి జూనియర్ అసిస్టెంట్లుగా, ముగ్గురికి టైపిస్టులుగా కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.