Share News

హైకోర్టు బెంచ్‌ కోసం బైక్‌ ర్యాలీ

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:20 PM

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రజా సం ఘాలు, ఆయా రాజకీయ పార్టీలు సంయుక్తంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

హైకోర్టు బెంచ్‌ కోసం బైక్‌ ర్యాలీ
బైక్‌ ర్యాలీలో పాల్గొన్న న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు

కలెక్టర్‌ ఏవోకు వినతిపత్రం అందజేత

కర్నూలు లీగల్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు, ప్రజా సం ఘాలు, ఆయా రాజకీయ పార్టీలు సంయుక్తంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొండారెడ్డి బురుజు, రాజ్‌విహార్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. కలెక్టరేట్‌ ఎదురుగా పలువురు ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు ప్రసంగించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.చంద్రుడు మాట్లాడుతూ కర్నూలులో రాజధానిని కోల్పోయి వివక్షతకు గురవుతుందని, ఇకపై ఆ వివక్షతను తొలగించడానికి శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ న్యాయవాది జయరాజు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్దికి పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా ఉద్యమిస్తామన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఏవోకు తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ర్యాలీలో ఐలూ (ఏఐఎల్‌యూ) నాయకులు వెంకటస్వామి, లక్ష్మణ్‌, ఐఏఎల్‌ నాయకులు బీఎస్‌ రవికాంత్‌ ప్రసాద్‌, పి.దస్తగిరి, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మీదేవి, బీటీఎఫ్‌ నాయకులు యేసురత్నం, పీవోపీ నాయకులు బి.శ్రీనివాసరావు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 11:20 PM