పోస్టల్ పథకాలను వినియోగించుకోండి
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:16 AM
ప్రజల సంక్షే మం కోసం పోస్టల్ శాఖ పలు పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజలందరూ సద్వినియో గించుకోవాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి
కర్నూలు లీగల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజల సంక్షే మం కోసం పోస్టల్ శాఖ పలు పథకాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజలందరూ సద్వినియో గించుకోవాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు. తపాలా శాఖ కర్నూలు డివిజన ఆధ్వర్యంలో స్థానిక న్యాయ సేవాసదన భవనంలో పోస్టల్ పథకాలపై అవ గాహన సద స్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జి.కబర్ధి మాట్లాడుతూ పోస్టల్ సేవింగ్స్, పెట్టుబడి, బీమా, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరె న్స వంటి పథ కాలు ప్రజల భవిష్యత్తు కోసం, ఆర్థిక భద్రత కోసం తపాలా శాఖ అందిస్తుంద న్నారు. ఆధార్ సేవల కోసం పోస్టల్ శాఖ ప్రత్యేక క్యాంప్ను స్థానిక న్యాయ సేవా సదన భవనలో నిర్వహించా రు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత చైర్మన ఎం.వెంకట హరినాథ్ పాల్గొన్నారు.