Share News

స్థిరమైన పారిశుధ్య సంస్కృతిని అమలు చేయాలి

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:30 PM

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న జీరో వేస్ట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (వ్యర్థ రహిత సంస్థలు) థీమ్‌ ద్వారా స్థిరమైన పారిశుధ్య సంస్కృతిని అమలు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

స్థిరమైన పారిశుధ్య సంస్కృతిని అమలు చేయాలి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న జీరో వేస్ట్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (వ్యర్థ రహిత సంస్థలు) థీమ్‌ ద్వారా స్థిరమైన పారిశుధ్య సంస్కృతిని అమలు చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుంచి స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమ అమలుపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, అంగన్‌వాడీ తదితర సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయాలని అన్నారు. స్థిరమైన పారిశుఽధయ సంస్కృతికి నాంది పలికే ఉద్యమంగా దీన్ని భావించాలన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:30 PM