Share News

జేఎన్టీయూకే, ఏపీ పోలీస్‌ శాఖ మధ్య అవగాహన ఒప్పందం

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:42 AM

జేఎన్టీయూకే, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ, ఏపీ పోలీస్‌ శాఖ మధ్య అవ గాహన ఒప్పందాన్ని బుధవారం వీసీ సమావేశ హాల్లో కుదుర్చుకున్నట్టు

జేఎన్టీయూకే, ఏపీ పోలీస్‌ శాఖ మధ్య అవగాహన ఒప్పందం
వీసీ ప్రసాద్‌ సమక్షంలో ఎంవోయూ పత్రాలను మార్చుకుంటున్న రిజిస్ర్టార్‌ శ్రీనివాసరావు, ఏఐజీ సత్తిబాబు

జేఎన్టీయూకే, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ, ఏపీ పోలీస్‌ శాఖ మధ్య అవ గాహన ఒప్పందాన్ని బుధవారం వీసీ సమావేశ హాల్లో కుదుర్చుకున్నట్టు ఉప కులపతి ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ తెలిపారు. సైబర్‌ నేరా ల నివారణ, దర్యాప్తు, డిజిటల్‌ పోలీసింగ్‌ రంగా ల్లో పోలీస్‌ సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఎంవోయూను కుదుర్చుకున్నామన్నారు. ఇరువురు ప్రతినిధులు సంతకాలు చేసిన అవగాహన ఒప్పంద పత్రాలను వీసీ ప్రసాద్‌ సమక్షంలో రిజిస్ర్టార్‌ ఆర్‌.శ్రీనివాసరావు, ఏఐజీ మోకా సత్తిబాబు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సివిల్‌, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లకు సైబర్‌ క్రైమ్‌ డిజిటల్‌ పోలీసింగ్‌లో 9 నెలల సర్టిఫికెట్‌ కోర్సును నిర్వహించనున్నట్టు వీసీ తెలిపారు. సైబర్‌ నేరాలపై అవగాహన పెంచి కేసుల విచారణలో సమర్ధతను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ వీసీలు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 12:42 AM