అమ్మో.. అలిపిరి
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:15 AM
గడిచిన పది రోజులుగా అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. సెలవులు ముసిగినా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికంగా భక్తులు తిరుమల చేరుకున్నారు.
గడిచిన పది రోజులుగా అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చే భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. సెలవులు ముసిగినా సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికంగా భక్తులు తిరుమల చేరుకున్నారు. అలిపిరి చెక్పాయింట్ వద్ద భక్తుల వాహనాలు అర కిలోమీటరుకుపైగా బారులు తీరాయి. ఒక్కో వాహనం చెక్పాయింట్ దాటి వెళ్లేందుకు గంటకుపైగా పట్టింది. దీంతో వాహనాల్లోని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
- తిరుపతి(భవానీనగర్), ఆంధ్రజ్యోతి