నేడు పాఠశాల యూనిట్గా ఐచ్ఛిక సెలవు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:51 AM
మొహర్రం సందర్భంగా పాఠశాల యూనిట్గా గురువారం ఐచ్ఛిక సెలవు తీసుకోవచ్చని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): మొహర్రం సందర్భంగా పాఠశాల యూనిట్గా గురువారం ఐచ్ఛిక సెలవు తీసుకోవచ్చని ఇన్చార్జి డీఈవో వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు అకడమిక్ క్యాలెండర్ 2026-27 అనుసరించి పాఠశాల యూనిట్గా సెలవు దినాన్ని ఎంఈవోలకు, డీవైఈవోలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఇన్చార్జి డీఈవో పేర్కొన్నారు.