స్వర్ణ రథంపై విహరించిన వరసిద్ధుడు
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:34 AM
కాణిపాకంలో మంగళవారం సంకటహర గణపతి వ్రతాన్ని వైభవంగా నిర్వహింపజేశారు
ఐరాల(కాణిపాకం), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో మంగళవారం సంకటహర గణపతి వ్రతాన్ని ఆలయ అధికారులు భక్తుల చేత వైభవంగా నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఉదయం మూల విరాట్కు అభిషేకం చేశాక సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లను ఆలయ ఆస్థాన మండపానికి తీసుకొచ్చారు. అక్కడున్న వేదికపై కొలువుదీర్చి, భక్తుల ఆధ్వర్యంలో వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి ఉత్సవర్లను స్వర్ణరథంపై ఉంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. స్వర్ణరథంపై స్వామిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు కాణిపాకం తరలివచ్చారు. ఆలయ ఈవో పెంచలకిషోర్, ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి పాల్గొన్నారు.