ముక్కంటి సేవలో థాయిలాండ్ భక్తులు
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:48 AM
శ్రీకాళహస్తిలోని వాయలింగేశ్వరుడిని ఆదివారం సుమారు 15మంది థాయిలాండ్ భక్తులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తిలోని వాయలింగేశ్వరుడిని ఆదివారం సుమారు 15మంది థాయిలాండ్ భక్తులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడి శిల్ప కళ అద్భుతంగా ఉందని తెలిపారు.