Share News

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Apr 20 , 2026 | 01:52 AM

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు కొత్తచట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతిఒక్కరు పుస్తక పఠనం చేస్తే మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు.

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
కోర్టు సముదాయంలో కాన్ఫరెన్స్‌ హాల్‌ను ప్రారంభిస్తున్న జస్టిస్‌ జయసూర్య

- హైకోర్టు జస్టిస్‌ జయసూర్య

చిత్తూరు లీగల్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు కొత్తచట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతిఒక్కరు పుస్తక పఠనం చేస్తే మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు. అంతకుముందు జిల్లా కోర్టు సముదాయాల ఆవరణలో మొక్క నాటి, నీరు పోశారు. అనంతరం కాన్ఫరెన్స్‌ హాలును ప్రారంభించారు. వర్క్‌షా్‌పకు హాజరైన న్యాయమూర్తులకు పూలమొక్కలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, రిటైర్డ్‌ జిల్లా జడ్జిలు విరూపాక్ష, దత్తాత్రేయ, కృష్ణయ్యతో పాటు పలువురు న్యాయమూర్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 01:52 AM