ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో పొగలు
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:24 AM
తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
రేణిగుంట, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.తిరుపతి నుంచి బయలుదేరిన రైలు రేణిగుంట దాటి వెళ్తుండగా మామండూరు సమీపంలో శుక్రవారం ఉదయం 6.45గంటల సమయంలో ఎస్-1 కోచ్ కింది భాగంలో బ్రేక్ షూ నుంచి పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు. లోకో పైలట్ రైలును ఆపివేసి ఎస్-1కోచ్ కింది భాగాన్ని గమనించారు. బ్రేక్ షూ నుంచి పొగలు వస్తున్నట్టు గుర్తించారు. రైలు బ్రేక్ వేయడంతో బ్రేక్ షూ వేడెక్కి పొగలు వచ్చినట్టు ఆయన నిర్దారించారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత రైలును యథావిధిగా ముందుకు నడిపించారు.