Share News

హజ్‌ యాత్రికులకు వైద్య పరీక్షలు

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:44 AM

హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డిస్ర్టిక్ట్‌ హర్బ్‌టేజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఉషశ్రీ ఐదుగురు డాక్టర్లతో కలిసి బీపీ, షుగర్‌, ఆర్‌బీఎస్‌ తదితర పరీక్షలు చేశారు.

హజ్‌ యాత్రికులకు వైద్య పరీక్షలు
హజ్‌ యాత్రికులకు వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): హజ్‌ యాత్రకు వెళ్లే వారికి ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. డిస్ర్టిక్ట్‌ హర్బ్‌టేజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఉషశ్రీ ఐదుగురు డాక్టర్లతో కలిసి బీపీ, షుగర్‌, ఆర్‌బీఎస్‌ తదితర పరీక్షలు చేశారు. వ్యాక్సినేషన్‌ చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లాడుతూ హజ్‌ యాత్రికులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్బరీ జునైద్‌, హజ్‌ కమిటీ రాష్ట్ట్ర కమిటీ డైరెక్టర్‌ పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌, మైనార్టీ నాయకులు, ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 01:44 AM