Share News

రాయచోటిలో నేడు ఇఫ్తార్‌ విందు

ABN , Publish Date - Mar 15 , 2026 | 02:21 AM

రంజాన్‌ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు.

రాయచోటిలో నేడు ఇఫ్తార్‌ విందు
ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లను మైనార్టీ నేతలతో కలిసి పరిశీలిస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటి, మార్చి14(ఆంధ్రజ్యోతి): రంజాన్‌ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి శనివారం మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఏపీ మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎస్‌.ఎం.డి.ఫరూక్‌ హాజరవుతున్నట్లు మంత్రి తెలిపారు. టీడీపీ నేత మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, యువనేత మౌర్యారెడ్డి, మున్సిపల్‌, పోలీసులు, ఇతర అధికారులు, ముస్లిం మైనార్టీ నేతలు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 02:21 AM