Share News

కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యం

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:49 AM

కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమంటూ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మీనరసయ్య అన్నారు. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యం
ప్రతిజ్ఞ చేస్తున్న వైద్య సిబ్బంది

డీఎంహెచ్‌వో లక్ష్మీనరసయ్య

మదనపల్లె క్రైం, జూలై 11(ఆంధ్రజ్యోతి): కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమంటూ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లక్ష్మీనరసయ్య అన్నారు. శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పిల్లల మధ్య వ్యవధి పాటిద్దాం-ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని నిర్మిద్దాం నినాదంతో ఈనెల 11 నుంచి 18వ తేదీ వరకు జనాభా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలతో మాతాశిశు మరణాలు సంభవిస్తాయన్నారు. జనాభా సమతుల్యత, స్థిరీకరణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మహ్మద్‌రఫీ, ప్రభాకర్‌, గంగయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 01:49 AM