డీయూ వీసీగా చిన్న మల్లయ్య
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:05 AM
కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయానికి కొత్త వైస్ చాన్సలర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో డెవల్పమెంట్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న చిన్న మల్లయ్య లక్కినేనిని వీసీగా నియమించారు.
కుప్పం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయానికి కొత్త వైస్ చాన్సలర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో డెవల్పమెంట్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న చిన్న మల్లయ్య లక్కినేనిని వీసీగా నియమించారు. ఈయన పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయ చట్టం-1997 ప్రకారం గవర్నర్, విశ్వవిద్యాలయ చాన్సలర్ అయిన ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నియామకాన్ని ఆమోదించారు. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ జీవో ఎంఎస్ నం.6ను విడుదల చేసింది. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురించనున్నారు.