కనువిందుగా గరుడసేవ
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:59 AM
గురుపౌర్ణమి సందర్భంగా తిరుమలలో బుధవారం రాత్రి నిర్వహించిన గరుడసేవ కనులపండువగా జరిగింది. విశేష పుష్ప, అభరణాల అలంకరణలో మలయప్పస్వామి గరుడ వాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించారు.
గురుపౌర్ణమి సందర్భంగా తిరుమలలో బుధవారం రాత్రి నిర్వహించిన గరుడసేవ కనులపండువగా జరిగింది. విశేష పుష్ప, అభరణాల అలంకరణలో మలయప్పస్వామి గరుడ వాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించారు. ఆహ్లాదకరమైన వాతారణంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, గోవిందనామస్మరణలు, కర్పూర హారతుల నడుమ గరుడసేవ వైభవంగా సాగింది. గురు పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాహనసేవను వీక్షించారు. - తిరుమల, ఆంధ్రజ్యోతి