93.83 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:31 AM
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 93.83 శాతం జరిగినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 93.83 శాతం జరిగినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,31,531 మందికి గాను తొలి రోజున 2,17,254 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారు. మిగిలిన 14,277 మంది లబ్దిదారులకు గురువారం ఇవ్వనున్నట్లు పీడీ పేర్కొన్నారు.