Share News

440 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:47 AM

లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.... చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మొగిలిఘాట్‌ వద్ద పోలీసులు బుధవారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు.

440 బస్తాల రేషన్‌  బియ్యం పట్టివేత
లారీని సీజ్‌ చేసిన పోలీసులు

బంగారుపాళ్యం,ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.... చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మొగిలిఘాట్‌ వద్ద పోలీసులు బుధవారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ లారీని తనిఖీ చేయగా 21,850 కిలోల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.4.37 లక్షల ఉంటుంది. లారీ డ్రైవర్‌ ప్రదీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ప్రధాన నిందుతుడు కిరణ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు. త్వరలో పట్టుకుంటామన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:47 AM