సర్వదర్శనానికి 24 గంటలు
ABN , Publish Date - May 24 , 2026 | 02:07 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
తిరుమల మే 23 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ మీదుగా బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
గురువారం హుండీ ఆదాయం: రూ.4.29 కోట్లు
శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 87,689
తలనీలాలు సమర్పించినవారు: 44,476