'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
ABN , Publish Date - May 30 , 2026 | 11:56 AM
‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో ఉండనుంది.
అమరావతి, మే 30: ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో ఉండనుంది. ప్రీమియర్ షో ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. జూన్ 4వ తేదీనుంచి 10 రోజుల పాటు మల్టీప్లెక్స్లో టికెట్పై రూ.125.. సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో టికెట్పై రూ.100 పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.