విద్యార్థుల చదువులపై నైట్ విజిట్
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:16 AM
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యార్థులు రాత్రిపూట ఇళ్లలో చదువుకుంటున్నారా.. లేదా.. అని ఉపాధ్యాయులు నైట్ విజిట్ చేస్తున్నారు.
కూడేరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యార్థులు రాత్రిపూట ఇళ్లలో చదువుకుంటున్నారా.. లేదా.. అని ఉపాధ్యాయులు నైట్ విజిట్ చేస్తున్నారు. మ రుట్ల జిల్లా పరిషత ఉన్నత పాఠశాల విద్యార్థుల ఇళ్ల వద్దకు శనివారం రాత్రి ఉపాధ్యాయులు వెళ్లి.. పలు సలహాలు.. సూచనలు ఇచ్చారు. ఇందులో హెచఎం ధనుంజయ్య, ఉపాధ్యాయులు నాగన్న, సిద్దప్రసాద్, శ్రీహరి, ప్రభాకర్ పాల్గొన్నారు.