ఉద్యోగ భద్రత జీవోను అమలు చేయాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:21 PM
ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత జీవోను అమలు చేయాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్ చేశారు.
ఉరవకొండ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత జీవోను అమలు చేయాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట మంగళవారం చేపట్టిన ధర్నాలో నాయకులు మాట్లాడారు. ఫిర్యాదులు పేరుతో ఉద్యోగులను వేధించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణస్వామి, మధు, స్వామి, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు.