Share News

‘ఆ భూములు మాకే ఇవ్వండి’

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:28 AM

తమకు 50 ఏళ్ల క్రితం ల్యాం డ్‌ సీలింగ్‌ పథకం 1970లో పట్టాలు మంజూరు చేశారని, ఆ భూ ములు తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని అంచనహాలు గ్రామానికి చెందిన 70 మంది రైతులు డిప్యూటి తహసీల్దారు చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం వినతి పత్రం అందించారు.

‘ఆ భూములు మాకే ఇవ్వండి’
డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం ఇస్తున్న రైతులు

విడపనకల్లు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): తమకు 50 ఏళ్ల క్రితం ల్యాం డ్‌ సీలింగ్‌ పథకం 1970లో పట్టాలు మంజూరు చేశారని, ఆ భూ ములు తమకే దక్కేలా చర్యలు తీసుకోవాలని మండలంలోని అంచనహాలు గ్రామానికి చెందిన 70 మంది రైతులు డిప్యూటి తహసీల్దారు చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం వినతి పత్రం అందించారు. ఇటీవల రీ సర్వే చేయటం వల్ల కొంతమంది నాటి భూస్వాములు ఆ భూములు తమవే అంటూ ఆర్డీఓ వద్దకు వెళ్లారని వాపోయారు. ఆ భూముల్లో తాము సాగుచేసుకుంటున్నామని, బ్యాంక్‌ల్లో రుణా లు కూడా తెచ్చుకున్నామని తెలిపారు. డీటీ మాట్లాడుతూ.. ఈ డీ పట్టాల విషయం ఆర్డీఓ వద్ద విచారణలో ఉందని, పట్టాలు పొం ది న రైతులు ఎవ్వరూ సాగులో లేరని ఫిర్యాదు రావటంతో విచారణ చేపట్టామని తెలిపారు. సాగులో ఉన్న రైతులు గుంతకల్లు ఆర్డీ ఓ కార్యాలయంలో ఆర్డీఓకు వివరణ ఇచ్చుకోవాలని సూచించారు.

Updated Date - Jan 10 , 2026 | 12:28 AM