ఎనసీసీ క్యాడెట్లకు దుస్తుల పంపిణీ
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:10 AM
స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 50 మంది ఎనసీసీ క్యాడెట్లకు ఎనసీసీ కేంద్ర శాఖ రూ.2.31 లక్షల విలువ చేసే దుస్తులు, ష్యూలు, క్యాప్ను మంజూరు చేసింది.
ధర్మవరం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 50 మంది ఎనసీసీ క్యాడెట్లకు ఎనసీసీ కేంద్ర శాఖ రూ.2.31 లక్షల విలువ చేసే దుస్తులు, ష్యూలు, క్యాప్ను మంజూరు చేసింది. వాటిని టీడీపీ నాయకులు, చేనేత ప్రముఖులు సంధారాఘవ, జింకాపురుషోత్తం శుక్రవారం ఆ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ పాఠశాలలో తిరిగి ఎనసీసీ శాఖను ఏర్పాటు చేసిన ఎనసీసీ కేర్ టేకర్ నాగేంద్రను అభినందించారు. కార్యక్రమంలో హెచఎం రామకృష్ణ, పీడీనాగేంద్ర, ఉపాద్యాయులు నాగరాజు పాల్గొన్నారు.