Share News

ఆలయ పనులు త్వరగా పూర్తిచేయండి

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:23 AM

పట్టణంలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రహరీ, ఇతర నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరి జవహర్‌లాల్‌ను విప్‌ కాలవ శ్రీనివాసులు కోరారు.

ఆలయ పనులు త్వరగా పూర్తిచేయండి
ప్రిన్సిపల్‌ సెక్రటరీతో విప్‌ కాలవ

రాయదుర్గం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రహరీ, ఇతర నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరి జవహర్‌లాల్‌ను విప్‌ కాలవ శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆలయ ప్రాకార నిర్మాణం కోసం టీటీడీ రూ.2.65 కోట్లు మంజూరు చేసిందని, సుమారు 40 శాతం పనులు పూర్తయ్యాయని, యుద్ధప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jan 10 , 2026 | 12:23 AM