తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:23 AM
మండలంలోని చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలోని ఓ వేపచెట్టు సోమవారం మధ్యా హ్నం రెండు గంటల సమయంలో కూలింది.
పుట్లూరు, జనవరి26(ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణంలోని ఓ వేపచెట్టు సోమవారం మధ్యా హ్నం రెండు గంటల సమయంలో కూలింది. గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తి అయిన తర్వాత విద్యార్థులు ఎవరూ లేని సమయంలో ఈ చెట్టు కూలడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. రోజూ ఆ సమయంలో మధ్యాహ్న భోజనం వడ్డించేవారు.