Chevella Road Accident: ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వెనుక ఎన్నో విషాద కథలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:02 PM
ఈ పుడమి మీద అన్నింటికంటే విలువైనది ప్రాణం. అదీ.. రక్తసంబంధీకులు హఠాత్తుగా చనిపోతే, ఆ బాధ వర్ణనాతీతం. ఆ లోటు ఎవ్వరికైనా తీర్చలేనిది.. ఎప్పటికీ పూడ్చలేనిది. నిక్షేపంగా ఉదయం బస్సు ఎక్కిన తమ
ఇంటర్నెట్ డెస్క్: ఈ పుడమి మీద అన్నింటికంటే విలువైనది ప్రాణం. అదీ.. రక్తసంబంధీకులు హఠాత్తుగా చనిపోతే, ఆ బాధ వర్ణనాతీతం. ఆ లోటు ఎవ్వరికైనా తీర్చలేనిది.. ఎప్పటికీ పూడ్చలేనిది. నిక్షేపంగా ఉదయం బస్సు ఎక్కిన తమ బిడ్డలు, తమ పేరెంట్స్, తమ అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు. ఇక లేరనే నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర వేదనతో గుండెలవిసేలా రోధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం వెనుక ఎన్నో విషాద కథలు.