Transport Department: రవాణా శాఖ తనిఖీల్లో 153 వాహనాల సీజ్
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:34 AM
విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేని, ఫిట్నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేని, ఫిట్నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 198 కేసులు నమోదు చేసి, 153 వాహనాలను సీజ్ చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 42 కేసులు నమోదు చేసి, 34 వాహనాలను సీజ్ చేశారు.
హైదరాబాద్లో 42 కేసులు నమోదు చేసి... 33 వాహనాలు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫిట్నెస్, సరైన పత్రాలు ఉంటేనే విద్యార్థులను తరలించాలని, లేకపోతే కేసుల నమోదుతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరించారు.