హైకోర్టులోనే న్యాయవాదికి గుండెపోటు.. మృతి
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:08 AM
హైకోర్టులో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఎండ, ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై కోర్టులో వాదనలు వినిపిస్తుండగానే పసునూరు వేణుగోపాలరావు (66) అనే న్యాయవాది గుండెపోటుతో
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): హైకోర్టులో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఎండ, ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై కోర్టులో వాదనలు వినిపిస్తుండగానే పసునూరు వేణుగోపాలరావు (66) అనే న్యాయవాది గుండెపోటుతో కుప్పకూలిపోయారు. 21వ కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలో మంగళవారం మధ్యాహ్నం 1.12 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయనకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం సమీపంలోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వేణుగోపాలరావు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది మృతికి సంతాపంగా న్యాయమూర్తి విచారణను నిలిపేశారు. ఇతర కోర్టుల్లో కేవలం అత్యవసర పిటిషన్లను మాత్రమే స్వీకరించారు.