జేఈఈ, నీట్, క్లాట్ కోసం ఇంటర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:19 AM
జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల సంస్థల విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ ఉచిత శిక్షణ ఇవ్వనున్నది.
ఫిజిక్స్ వాలాతో ‘తెలంగాణ అచీవర్స్-2025’ నిర్వహణ
జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల సంస్థల విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ ఉచిత శిక్షణ ఇవ్వనున్నది. తెలంగాణ అచీవర్స్-2025 పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో.. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల కోచింగ్లో ప్రఖ్యాతిగాంచిన ఎడ్టెక్ సంస్థ ఫిజిక్స్వాలా భాగస్వామ్యంతో ఈ శిక్షణ అందించనుంది.
ఈ విషయమై విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా శుక్రవారం ఇంటర్ విద్యామండలిలో అధికారులతో సమీక్షించారు. ఫిజిక్స్వాలా భాగస్వామ్యంతో వచ్చే నెల నుంచి డిసెంబర్ వరకూ ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణనందిస్తామని ఆమె తెలిపారు.